ఇన్నాళ్లకు టాలీవుడ్ లో మరో ఆఫర్ ను సొంతం చేసుకున్న మేఘా ఆకాష్

సౌత్ ఇండియాలో ఈ మధ్య కాలంలో చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్స్ వెండితెరకి పరిచయం అవుతున్నారు.

వారిలో చాలా మంది తమ టాలెంట్ తో ప్రూవ్ చేసుకొని అవకాశాలు పెంచుకుంటున్నారు.

ప్రస్తుతం సినిమాలలో హీరోయిన్స్ కాంపిటేషన్ ఎక్కువ ఉండటంతో వెండితెరపైకి వచ్చే అందాల భామలు ఎప్పటికప్పుడు తమని తాము కొత్తగా ప్రెజెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

అలాగే తాము ఎంత బెస్ట్ పెర్ఫార్మర్ అనే విషయం దర్శకులకి అర్ధమయ్యే విధంగా చేస్తున్నారు.

ఇలా ప్రూవ్ చేసుకున్న భామతో మేఘా ఆకాష్ కూడా ఉంటుంది.ఈ అమ్మడు తమిళంలో హీరోయిన్ గా మంచి సినిమాలు చేస్తుంది.

అయితే తెలుగులో నితిన్ కి జోడీగా లై, చల్ మోహన రంగా సినిమాలలో నటించింది.

రెండు సినిమాలలో ఈమె చేసిన పాత్రలకి మంచి ప్రాధాన్యత ఉంది.అయితే ఈ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో మేఘా ఆకాష్ కి తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు.

అదే సమయంలో తమిళంలో అవకాశాలు ఎక్కువగా ఉండటంతో అక్కడ సినిమాలు చేసుకుంటూ వస్తుంది.

అయితే చాలా గ్యాప్ తర్వాత తెలుగు మేఘా ఆకాష్ మరో అవకాశం సొంతం చేసుకుంది.

టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నూతన దర్శకుడు హసిత్ గోలి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది.

వివేక్ ఆత్రేయ దగ్గర అసోషియేట్ గా పనిచేసిన హసిత్ వివేక్ డైరెక్ట్ చేసిన మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా సినిమాల్లో హీరో శ్రీవిష్ణునే హీరోగా ఎంపిక చేసుకున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా మేఘా ఆకాష్ కు లక్కీ ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది.

మరి లో బడ్జెట్ సినిమా అయినా టాలెంటెడ్ క్రూతో వర్క్ చేస్తున్న కారణంగా సినిమాలో మేఘా పాత్రకి మంచి ప్రాధాన్యత ఉండే అవకాశం ఉంది.

మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలుగులో ఈ అమ్మడు కెరియర్ ని స్పీడ్ అప్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి.

మధుమేహం ఉన్నవారు బంగాళదుంప తినొచ్చా.. క‌చ్చితంగా తెలుసుకోండి..!