రాజ్యసభ సీటుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు

వరుసగా రెండో రోజు మెగాస్టార్ చిరంజీవి విజయవాడకు వచ్చారు.సతీసమేతంగా హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.చిరంజీవిని వైసీపీ ప్రభుత్వం రాజ్యసభకు పంపబోతోందనే ప్రచారం జరుగుతోంది.

రాజ్యసభ ఆఫర్ వార్తలను ఆయన తోసిపుచ్చారు.తాను రాజకీయాలకు పూర్తి దూరమని స్పష్టం చేశారు.

వైసీపీ తనకు రాజ్యసభ ఆఫర్ చేసిందని వస్తున్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు.వైసీపీ తనకు రాజ్యసభ ఇస్తానన్నది ఊహాజనితమేనని వ్యాఖ్యానించారు.

రాజకీయాలకు తాను అతీతమని తెలిపారు.రాజకీయాలకు దూరంగా ఉన్న తనకు ఇలాంటి ఆఫర్లు రావని చెప్పారు.

ఇలాంటి ఆఫర్లను తాను కోరనని ప్రకటించారు.అటువంటి వాటికి తాను దూరమని చిరంజీవి స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి , ఎంపీ అభ్యర్థి వరప్రసాద్