చిరంజీవి ఈ రెండు వదిలేసి ఆ సినిమా షూట్ లో పాల్గొంటున్నాడా!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదల కాకముందు వరుసగా సినిమాలను కమిట్ అయిన విషయం తెలిసిందే.

మొదట మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ ని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేసేందుకు చిరంజీవి సైన్‌ చేశాడు.

ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా ను తెలుగులో బోళా శంకర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు.

ఇవి కాకుండా వాల్తేరు వీరన్న అనే టైటిల్ తో బాబీ దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్నాడు.

ఈ మూడు ఒక ఆర్డర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.ఈ మూడు సినిమా లు కూడా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు.

అయితే త్వరలో విడుదల కావలసిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క షూటింగ్ బ్యాలెన్స్ ఉండగానే ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరన్న సినిమా షూటింగ్ లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

అక్టోబర్ లో గాడ్ ఫాదర్ సినిమా ను ప్రేక్షకుల ముందుకు దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర సభ్యుల అధికారికంగా ప్రకటించారు.

అయినా కూడా ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేయకుండా చిరంజీవి మరో సినిమా షూటింగ్ లో పాల్గొన్న పట్ల మెగా అభిమానుల్లో చర్చ జరుగుతోంది.

అసలు చిరంజీవి ఎందుకు గాడ్ ఫాదర్ విషయం లో ఆసక్తిగా లేరు అంటూ కొందరు చర్చించుకుంటూ ఉంటే.

మరి కొందరు మాత్రం ఆ సినిమా కు కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే ఉంది.

రెండు మూడు రోజుల్లోనే షూటింగ్ పూర్తి అవుతుంది.ఇతర పనులు పూర్తి చేసి ఈనెల చివరి వరకు మొదటి కాపీ కూడా రెడీ చేస్తారంటూ సమాచారం అందుతుంది.

ఈ విషయం లో చిరంజీవి అభిమానులు కానీ సినీ వర్గాల వారు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి ఏ సమయం లో ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనే విషయం తెలుసు కనుక ఆ విషయం లో ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ మెగా ఫ్యామిలీ కి చెందిన కొందరు అభిమానులకు సూచిస్తున్నారు.

లిస్ట్ రెడీ అయ్యిందా ? వైసీపీ నాయకుల్లో పెరుగుతున్న టెన్షన్