చిరంజీవి ఎస్పీ బాల సుబ్రమణ్యం ని అలా పిలిచాడని మందలించాడంట…

తెలుగులో ప్రముఖ గాన గంధర్వుడు సీనియర్ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నిన్నటి రోజున మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే.

 దీంతో పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులేగాకుండా కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్, మల్లువుడ్, భోజ్పురి ఇలా దేశంలోని అన్ని సినీ పరిశ్రమల నటీనటులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

 ఇందులో భాగంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణ వార్త వినగానే తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని కుటుంబ సభ్యులకి తెలియజేశాడు.

అంతేకాక సినీపరిశ్రమలో ఎస్పీ బాలసుబ్రమణ్యం తో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి ఓ వీడియో ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు.

ఈ క్రమంలో సినిమా పరిశ్రమలో తనతో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎస్పీ.

బాలసుబ్రహ్మణ్యం ఒకరని తెలిపాడు. తాను సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గురించి తెలియక అన్నయ్య అంటూ ఏకవచనంతో సంబోధించే వాడినని కానీ ఆయన ప్రతిభను తెలుసుకున్నప్పటి నుంచి "మీరు" అంటూ సంబోధించేవాడినని చెప్పుకొచ్చాడు.

దాంతో ఓసారి ఎస్పీ బాలసుబ్రమణ్యం తనని పిలిచి ఎప్పుడూ అన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించే నువ్వు "మీరు అంటూ ఈ మధ్య వేరు చేస్తున్నావ్ ఏంటయ్యా.

? అంటూ మందలించాడని" తమ మధ్య అంతా సాన్నిహిత్యం ఉండేదని కొంతమేర ఎమోషనల్ అయ్యాడు.

అంతేగాక బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం మరణం సినీ ప్రపంచానికి తీరని లోటని, ఈ లోటుని భర్తీ చేయడం కేవలం మళ్లీ ఆయన పుట్టుకతోనే సాధ్యమవుతుందని ఆయన సేవలను కొనియాడారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి "ఆచార్య" అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

 కాగా ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన దాదాపుగా 45 శాతం చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.

 దీంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

ఏపీకి ప్రధాని మోది .. ఎన్నికల టూర్ ప్లాన్ ఇలా