అలా చేస్తే ఇండస్ట్రీ పని అయిపోతుంది.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!

మ్యాచో స్టార్ గోపీచంద్ కు టాలీవుడ్ లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.టాలీవుడ్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు సంపాదించుకున్న హీరోల లిస్టులో గోపీచంద్ కూడా ఉన్నారు.

ప్రెసెంట్ గోపీచంద్ మారుతీ దర్శకత్వంలో "పక్కా కమర్షియల్" సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో గోపీచంద్ కు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఈ సినిమా నుండి ఎప్పటి కప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ లను ఇస్తూ ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఈ సినిమా ప్రెస్ రిలీజ్ ఈవెంట్ ను నిన్న గ్రాండ్ గా నిర్వహించారు.

ఈ ఈవెంట్ లో భాగంగా నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

''మారుతి ప్రత్యేకత ఏంటంటే రెండున్నర గంటల పాటు నవ్విస్తూనే.ఒక మెసేజ్ ఇచ్చి మరీ హాయిగా బయటకు పంపిస్తాడు.

మన తెలుగు ఇండస్ట్రీ ఈ మధ్య ఒక కొత్త పాఠం నేర్చుకుంది.టికెట్ రేట్స్ ను తగ్గించండి.

ఓటిటి లకు కాస్త దూరం పెట్టండి అని.చెప్పుకొచ్చాడు.

ఎప్పుడైనా సరే మారుతి సినిమా థియేటర్ లో చూస్తేనే బాగుంటుంది.అప్పుడే సినిమాను ఎంజాయ్ చేస్తూ చూడగలం.

"""/"/ కొన్ని సినిమాలను థియేటర్ లోనే చూడాలి.ఎఫ్ 3 సినిమాను కూడా థియేటర్ లోనే చూడమని బన్నీకి కూడా చెప్పాను.

ఇక పక్కా కమర్షియల్ సినిమా కూడా అలాంటిదే.ఈ సినిమా ఓటిటి లోకి రావడానికి చాలా సమయం పడుతుంది.

ఏ సినిమాను అయినా వెంటనే ఓటిటి లోకి తీసుకు వస్తే మన ఇండస్ట్రీ పని అయిపోతుంది అనే విషయం అర్ధం అయ్యింది.

"""/"/ ఇంకా గోపీచంద్ కు ఇలాంటి ఫంక్షన్స్ ఇష్టం లేదని.సిగ్గు అని తెలిపాడు.

అయితే ఈసారి మాత్రం గోపీచంద్ ను రప్పించాలని అనుకున్నాం.ఈ మధ్య ఒక పెద్ద హీరో స్టేజ్ మీద స్టెప్పులు వేసి సినిమాను ప్రోమోట్ చేసారు.

అలా అందరు చేయవలిసి ఉంటుంది.సినిమాకు సంబంధించి ఎలాంటి ఫంక్షన్ ఉన్న మీరు వచ్చి ప్రమోట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది మీ సినిమా'' అంటూ అల్లు అరవింద్ ముగించారు.

ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఫుడ్స్ ఇవే!