మెగా హీరోలకు టైం అస్సలు బాలేదుగా.. బ్రో, భోళా శంకర్ దారిలో వరుణ్ తేజ్ మూవీ అంటూ?

2023 సంవత్సరం సెకండాఫ్ మెగా హీరోలకు కలిసిరాలేదా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఈ ఏడాది పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కి థియేటర్లలో విడుదలైన బ్రో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ కావడం గమనార్హం.

బ్రో సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు 60 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉండటంతో నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

"""/" / భోళా శంకర్( Bhola Shankar ) సినిమాకు రిలీజ్ రోజునే నెగిటివ్ టాక్ వచ్చింది.

ఈ సినిమా ఫుల్ రన్ లో 30 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేదు.

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో భోళా శంకర్ మూవీ భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో ఒకటి కావడం గమనార్హం.

తాజాగా విడుదలైన గాండీవధారి అర్జున( Gandeevadhari Arjuna ) సినిమా కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోలేదు.

ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా నిర్మాతలకు భారీ షాకిచ్చింది.

"""/" / ప్రవీణ్ సత్తారు గత సినిమా ది ఘోస్ట్ కూడా ఆశించిన రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిల్ అయిందనే సంగతి తెలిసిందే.

ప్రవీణ్ సత్తారు భారీ బడ్జెట్లతో సినిమాలను తెరకెక్కిస్తుండగా మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు.

భారీ ప్రాజెక్ట్ ల విషయంలో ప్రవీణ్ సత్తారు జాగ్రత్త వహించాల్సి ఉంది.సాక్షివైద్య( Sakshi Vaidya ) ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా ఆమెకు భారీ షాక్ తగిలింది.

తెలుగులో వరుసగా సినిమాలలో నటిస్తున్నా తన నటనతో ప్రేక్షకులను మెప్పించే విషయంలో సాక్షి వైద్య ఫెయిలవుతున్నారు.

గాండీవధారి అర్జున టైటిల్ పవర్ ఫుల్ గా ఉన్నా సినిమాలో ఆ పవర్ లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

వరుణ్ తేజ్ కు కెరీర్ విషయంలో సరైన గైడెన్స్ అవసరమని చెప్పవచ్చు.

వైరల్ వీడియో: మహిళ పైకి దూసుకెళ్లిన పాము.. చివరకు..