వైరల్ ఫోటో: మెగాహీరోల టీనేజ్ ఫోటో చూశారా!?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది హీరోలు ఉన్న విషయం తెలిసిందే.

కేవలం మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా నేటి తరానికి అరడజనుకు పైగా హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇవ్వడమే కాదు ప్రతి ఒక్కరు కూడా తనదైన గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్, రామ్ చరణ్ లు టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా మిగతా హీరోలు కూడా తమదైన గుర్తింపు సంపాదించుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

అయితే మెగా అభిమానులకి టాలీవుడ్లో కోట్లల్లో అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా కొత్త ఫోటో సోషల్ మీడియా వేదికకు ఎక్కింది అంటే అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

ఇలాంటి ఒక ఫోటోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ నిహారిక కలిసి ఉన్న ఓ టీనేజ్ ఫోటో ప్రస్తుతం మెగా అభిమానులు అందరినీ ఆకర్షిస్తోంది.

ఫోటో చూసి మురిసిపోతున్న అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు.దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

హిందీ బెల్ట్ లో ఎన్టీఆర్ కంటే రామ్ చరణ్ తోపు.. అసలేం జరిగిందంటే?