వారం గ్యాప్‌ లో రాబోతున్న మెగా బ్రదర్స్ ప్లస్‌ మైనస్‌ లు ఏంటీ?

మెగా ఫ్యామిలీలో హీరోలు చాలా మంది అయ్యారు.చాలా కాలంగా ఏదో ఒక సమయంలో వారిలో వారే పోటీ పడే రోజు వస్తుంది అంటూ కామెంట్స్ వచ్చాయి.

ఆ రోజు రానే వచ్చింది.మెగా హీరోలు అయిన సాయి ధరమ్‌ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ లు పోటీ పడబోతున్నారు.

వారం రోజుల గ్యాప్ లో వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్దం అయ్యారు.

ఈ రెండు సినిమా లపై కూడా జనాల్లో ఆసక్తి ఉంది.ఇద్దరు అన్నదమ్ములు కూడా పోటీ పడాల్సి వస్తుందని.

అది ఇంత త్వరగా వస్తుందని ఎవరు ఊహించలేదు.బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను దక్కించుకునేందుకు గాను వీరిద్దరు పోటీ పడుతున్నారు.

సాయి ధరమ్‌ తేజ్‌ రిపబ్లిక్ మరియు వైష్ణవ్ తేజ్‌ కొండ పొలం సినిమాలు కేవలం వారం రోజుల గ్యాప్ లో రాబోతున్నాయి.

ఈ రెండు సినిమాలు కూడా మంచి బజ్ ను కలిగి ఉన్న నేపథ్యంలో వసూళ్లు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారింది.

ఈ రెండు సినిమాల్లో ఎవరికి ప్లస్‌ పాయింట్స్ ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఖచ్చితంగా ఎక్కువ శాతం కొండ పొలంకు పాజిటివ్ ఉంది.

"""/"/ఎందుకంటే వైష్ణవ్‌ తేజ్‌ 100 కోట్ల ఉప్పెన తర్వాత రాబోతున్న సినిమా కావడంతో పాటు క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడం వల్ల కూడా ఈ సినిమా కు బజ్ ఉంది.

సాయి ధరమ్‌ తేజ్ గత కొంత కాలంగా కాస్త పర్వాలేదు కాని దర్శకుడు దేవా కట్టా సక్సెస్ కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

కాస్త కొండ పొలం వైపు ఆసక్తి ఉన్నా కూడా ఇద్దరు మెగా హీరోలు ఖచ్చితంగా ఓ రేంజ్ లో సక్సెస్ ను దక్కించుకుంటారు అనే నమ్మకం అందరు వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వైసీపీకే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో వార్ వన్ సైడ్!