రాజ్యసభ రేసులో మెగా బ్రదర్ ? టీడీపీ నుంచి సుహాసిని ?
TeluguStop.com
ఏపీ నుంచి రాజ్యసభకు( Rajyasabha ) ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై టిడిపి, జనసేన ,బిజెపి కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
వైసిపి నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసిన నేపథ్యంలో , వారి స్థానంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపైన కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటికే ముగ్గురు సభ్యుల ఎంపిక పైన చంద్రబాబు( CM Chandrababu ) ప్రతిపాదనలు సిద్ధం చేశారట.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్,( Pawan Kalyan ) బిజెపి నాయకత్వంతోనూ రాజ్యసభ సభ్యుల ఎంపికపైనా చర్చించినట్లు సమాచారం.
దీనిలో భాగంగానే రెండు టిడిపి , ఒకటి జనసేనకు ఇవ్వాలని చంద్రబాబు భావించినా, మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు చేసే దిశగా నిర్ణయించుకున్నట్లు సమాచారం .
ఇక అభ్యర్థుల ఎంపికైన పూర్తిగా చంద్రబాబు దృష్టి సారించారట.వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు.
వీరిలో మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ టిడిపిలో చేరారు .తిరిగి మస్తాన్ రావు కు( Mastan Rao ) రాజ్యసభ ఇస్తామనే హామీ కూడా ఇవ్వడంతో , ఈ విషయంలో ఆచితూచి ఎంపిక చేస్తున్నారు.
"""/" /
ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీలకు పూర్తిగా బలం ఉండడంతో , మూడు స్థానాలు వీరికే దక్కుతాయి.
దీనిలో భాగంగానే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు( Nagababu ) పేరును పరిశీలిస్తున్నారట.
అయితే చివరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప , దాదాపుగా నాగబాబు పేరు ఖరారు అయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఇక టిడిపి నుంచి చాలామంది రాజ్య సభ్యత్వం పై ఆశలు పెట్టుకున్నారు .
వీరిలో నందమూరి సుహాసిని( Nandamuri Suhasini ) పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో టిడిపి రాజకీయ భవిష్యత్తు, ప్రయోజనాల దృష్ట్యా నందమూరి కుటుంబానికి ప్రాధాన్య దిశగా సుహాసిని పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇక పార్టీ సీనియర్ నేతలైన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ , కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, మాజీమంత్రి యనమాల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
"""/" /
టిడిపి నుంచి ఈసారి బీసీకి అవకాశం ఇస్తారని, కొత్త వారికి కాకుండా తిరిగి మస్తాన్ రావుని టిడిపి నుంచి ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ కీలక నాయకులు కొంతమంది చెబుతున్నారు .
అయితే బిజెపికి ఒక స్థానం ఇవ్వాలనే ప్రతిపాదన ఉండడంతో, త్వరలోనే వైసీపీ నుంచి మరొక రాజ్యసభ సభ్యుడు రాజీనామా చేసి అవకాశం ఉంటుందని , అదే జరిగితే బిజెపికి అవకాశం ఇస్తామని టిడిపి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
ఈ మూడు స్థానాల్లో ఒకటి బిజెపికి ఇవ్వాలని తాజాగా చర్చ జరిగిన నేపథ్యంలో , మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సీటు ఖరారు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
అయితే టిడిపి నుంచి ఎక్కువమంది రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తూ ఉండడంతో ఈ ఎంపికలు చంద్రబాబు కు ఇబ్బందికరంగానే మారిందట.
గౌతమ్ తిన్ననూరి ‘కింగ్ డమ్’ రెండు పార్టు లను సక్సెస్ చేస్తాడా..?