ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ… మెగా బ్రదర్ కూ ఛాన్స్
TeluguStop.com
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీకి టిడిపి అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) శ్రీకారం చుట్టారు .
ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల విషయమై చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పటి వరకు దాదాపు 23,000 మంది నామినేటెడ్ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ పదవుల భర్తీ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Deputy CM Pawan Kalyan ), ఏపీ బీజేపీ అధ్యక్షురాలు , రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందరేశ్వరితో( MP Daggupati Purandareshwari ) చంద్రబాబు చర్చించారు.
ఈ సందర్భంగా దశలవారీగా ఈ పదవులను భర్తీ చేయాలని నిర్ణయించారు.మూడు పార్టీలలోని నాయకులకు ఏ విధంగా పదవులు కేటాయించాలనే విషయం పైన ఒక క్లారిటీకి వచ్చారు.
అలాగే టిడిపి సీనియర్లకు కీలక పదవులు ముందుగా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. """/" /
టిడిపి సీనియర్లతో పాటు, జనసేన , బిజెపిలోని( Janasena, BJP ) ముఖ్యమైన నాయకులకు రాష్ట్రస్థాయి పదవులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు .
మెగా బ్రదర్ నాగబాబుకూ( Mega Brother Nagababu ) కీలకమైన పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం.
అలాగే బిజెపిలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఆశించి భంగపడిన నేతలకు కీలకమైన నామినేటెడ్ పదవులు ఇవ్వబోతున్నారట.
టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఆర్టీసీ చైర్మన్ , ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఏపీఐఐసీ చైర్మన్ , పట్టాభికి పౌరసరఫరాల కార్పొరేషన్, మాజీ మంత్రి పీతల సుజాతకు ఎస్సీ కమిషన్, మరో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ కు ఎస్టి కమిషన్ చైర్మన్ ఖరారు అయినట్లు తెలుస్తోంది .
జనసేన కీలక నేత మంత్రి నాదెండ్ల మనోహర్ కు తెనాలి సీటు కేటాయించడంతో అక్కడ సీటు కోల్పోయిన టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ కు అమరావతికి సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం .
"""/" /
రాష్ట్రవ్యాప్తంగా 90 వరకు కార్పొరేషన్లు ఉండగా , వాటి చైర్మన్ లు , అందులో మెంబర్లు కలిసి వందల్లోనే పోస్టులు ఉన్నాయి.
ఇవి మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా భర్తీ చేయాలని భావిస్తున్నారు.
దాదాపు 30% పదవులు తొలి విడతలోనే భర్తీ చేయనున్నట్లు సమాచారం.అలాగే టిటిడి బోర్డు ఏర్పాటు పైన ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఓ మీడియా సంస్థ అధినేతకు టీటీడీ చైర్మన్ పదవిని కేటాయించబోతున్నట్లు సమాచారం.
వావ్, 3 గంటల్లోనే మర్డర్ కేస్ సాల్వ్ చేసిన ముంబై పోలీస్..!