కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మేడిపల్లి దేవానందం నియామకం

నియామక పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందజేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా మేడిపల్లి దేవానందమును జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ నియమించారు.

మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా దేవానందమును నియమిస్తూ నియామక పత్రాన్ని తన స్వగృహంలో అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు కృషి చేస్తానని ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

బాబాయ్ కి కోపం వస్తే అలా పిలుస్తారు…ఆ గిఫ్ట్ అలానే ఉంది: నిహారిక