డార్లింగ్ కోసమే ఎదురుచూస్తున్న హీరోయిన్, డైరెక్టర్.. మరి ఈయన కరుణించేదెప్పుడో?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

కానీ ఈయనకు అంత సక్సెస్ కాదు కదా మాములు సక్సెస్ కూడా దరి చేరడం లేదు.

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ రెండు కూడా ప్లాప్ అయ్యాయి.భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ రెండు సినిమాలు భారీ ప్లాప్ మూటగట్టుకోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశలో ఉన్నారు.

అయితే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న సినిమాలపై డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రెసెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఈ సినిమా కంటే ముందే ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కు రెడీగా ఉంచాడు.

ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇంకా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు.

అలాగే సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్ ప్రకటించాడు.ఇక ప్రభాస్ చేతిలో ఇప్పటికే అన్ని సినిమాలు ఉన్నాయి.

ఇవి పూర్తి అయ్యే వరకు మరొక సినిమా ఉండదు అని అంతా అనుకున్నారు.

కానీ ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అని తెలిసి అందరు ఆశ్చర్య పోయారు.

మారుతి, ప్రభాస్ కాంబోలో వస్తున్న సినిమా ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాని మారుతి ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఈ సినిమా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందట.

హారర్ అండ్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని టాక్ వచ్చింది.ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి.

"""/" / ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో ఇప్పటికే మాళవిక మోహనన్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యిందట.

అటు మారుతి, ఇటు మాళవిక ఇద్దరు కూడా మరో ప్రాజెక్ట్ జోలికి వెళ్లకుండా ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ప్రభాస్ ఎప్పుడు వస్తే అప్పుడు సిద్ధంగా ఉండాలని డేట్స్ క్లాష్ అవ్వకుండా ఇద్దరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరి ప్రభాస్ వీరిని ఎప్పుడు కరుణిస్తాడో వేచి చూడాల్సిందే.

అయోధ్య, శ్రీరాముడి చుట్టూ ఎన్ని సినిమాలు రాబోతున్నాయో తెలుసా ?