కరోనా భయంతో వివాహిత హత్యా.. ఆత్మహత్య..!

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ఈ మహమ్మారి బారినపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

ఇప్పటికి ఈ వైరస్ బారినపడి చాల మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అయితే రాష్ట్రంలో కరోనా బారినపడి చనిపోయే వారి సంఖ్య కంటే కరోనా భయంతో చనిపోయే వారి సంఖ్య ఎక్కవగా ఉంది.

తాజాగా మరో మహిళ కరోనా వచ్చిందని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన నార్సింగి పోలీసు స్టేషన్ పరిధిలోని అల్కాపూర్‌లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.చిత్తూరు జిల్లాకు చెందిన 37 ఏళ్ల మహిళ హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది.

ఆమె భర్త, కుమారుడితో కలిసి అల్కాపూర్ కాలనీలో జీవనం సాగిస్తుంది.అయితే ఆమె భర్త ఆన్‌లైన్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే శనివారం రాత్రి అందరు పడుకున్నాక ఆమె అనుమానస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడింది.

ఆమె సూసైడ్ నోటులో ఆమెకు కరోనా ఉన్నట్లు పేర్కొంది.అలాగే తన మృతదేహాన్ని ఎవరు తాకొద్దు అంటూ పేర్కొంది.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మృతురాలిది హత్యనా, ఆత్మహత్యనా అనే కోణంలో విచారణ చేపట్టారు.

మేము ఆర్భకులం కాదు అర్జునులం .. కేసిఆర్ కు కోమటిరెడ్డి కౌంటర్