కేవలం… 10 వేల రూపాయలకి కట్టుకున్న భార్యనే అమ్మేసిన భర్త….

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు మోజులో పడి ఎంతటి ఘాతుకానికైనా పాల్పడుతున్నారు.తాజాగా ఓ వ్యక్తి కేవలం పది వేల రూపాయల డబ్బు కోసం తన కట్టుకున్న భార్యని వేరే వ్యక్తికి రెండు గంటలపాటు అమ్మేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి సంబల్ అనే పట్టణంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు.

అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం చిన్నచిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు.

అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా వ్యక్తికి చేయడానికి ఎలాంటి పనులు దొరకలేదు.దీంతో డబ్బు కోసం తన భార్యను రెండు గంటలపాటు వేరే వ్యక్తికి అమ్మేశాడు.

 అయితే తాను ఇచ్చినటువంటి రెండు గంటల గడువు పూర్తయినప్పటికీ తన భార్య తిరిగి రాకపోవడంతో దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాడు.

అంతేగాక తన భార్య గురించి పలు వివరాలను పోలీసులకి అందించి ఎలాగైనా తన భార్యను వెతికి పెట్టాలంటూ పోలీసులను కోరాడు.

 మహిళ భర్త తెలిపినటువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు వివాహిత కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సీఎంపై రాయిదాడి కేసు..నిందితుడి కస్టడీ పిటిషన్ పై రేపు ఆర్డర్