పరువు కోసం కన్న కూతురుని కనికరం లేకుండా

ఆ మధ్య మిర్యాల గూడా లో ప్రణయ్ హత్యా ఉదంతం ఎంత సంచలనంగా మారిందో అందరికి తెలిసిందే.

కూతురుని ఓ తక్కువ కులం వాడు పెళ్లి చేసుకున్నాడని పంతంతో కనికరం లేకుండా ప్రణయ్ ని మారుతీరావు అనే తండ్రి హత్య చేయించాడు.

ఆ సంఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది.ఆ తరువాత పరువు హత్యలపై దేశ వ్యాప్తంగా మరో సారి చర్చ నడిచింది.

ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్రలో ఆ తరహా సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.

మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని నిగోజ్ గ్రామానికి చెందిన మంగేష్ రాన్సింగ్,రుక్మిణి కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారు.

అయితే కులాలు వేరుకావడంతో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు.చివరకు మంగేష్‌ తల్లిదండ్రుల సమక్షంలో గత అక్టోబరులో వివాహం చేసుకున్నారు.

అయితే ఇటీవలే మంగేష్‌తో రుక్మిణికి గొడవ జరిగింది.దీంతో ఆమె ఏప్రిల్ 30న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది.

రుక్మిణిని తీసుకెళ్లేందుకు మంగేష్ మే 1న అత్తగారింటికి వచ్చాడు.ఇదే అదనుగా భావించిన రుక్మిణి బంధువులు మంగేష్‌ను తీవ్రంగా చితకబాదారు.

తరువాత కూతురు అన్న కనికరం కూడా లేకుండా భర్తతో పాటు ఆమెని బంధించి వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.

అయితే వీరి అరుపులను గమనించిన పొరుగువారు వారిని ఆసుపత్రికి తరలించారు.ఇక ఈ సంఘటనకి బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

విజయవాడలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో ఐదుగురు మృతి