తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం వి.

ఐ.పి విరామ సమయంలో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర కామత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందారేష్,‌ ఏపి మంత్రి జోగి రమేష్, కర్ణాటక మాజీ మంత్రి రేవన్నా, బిజేపి ఏపి ఇంఛార్జ్ సునీల్ ధియోధర్ లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

అనంతరం బిజేపి నేత సునిల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ.అగ్నిపధ్ యువతకు అద్భుతమైన పధకంమని, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ యువతను తప్పు దోవ పట్టింస్తుందన్నారు.

‌మంచి పధకాలను ప్రధాన ప్రతిపక్షాలు తప్పుగా ప్రచారం చేయిస్తుందని, కొందరు రౌడీలను రంగంలోకి దింపి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సునీల్ ధియోధర్ మండిపడ్డారు.

ప్రేక్షకులకు నచ్చకపోవడంతో లెన్త్ తగ్గించుకున్న సినిమాలు ఇవే !