పంట పొలంలో వ్యక్తి మృతదేహం…?

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని పంట పొలంలో ఓ వ్యక్తి మృతదేహం లభించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.నేరేడుచర్ల ప్రభుత్వ వైద్యశాల( Nereducharla Government Hospital ) పక్కన పంట పొలాల్లో అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడుపట్టణానికి చెందిన అరూరి శ్రీనివాస్ (35)గా గుర్తించారు.

అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం( Postmortem ) నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

మృతుడు శ్రీనివాస్ నేరేడుచర్ల పట్టణంలో టీ స్టాల్ నిర్వహిస్తున్నాడని, అతడికి 9 ఏళ్ల క్రితం వివాహమైందని,గత ఆరు నెలల క్రితమే విడాకులు తీసుకున్నాడని,మృతుడి కుటుంబ సభ్యులు తెలిపినట్లు,ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

లిఫ్ట్ ఎక్కిన బాలికను దారుణంగా కరిచేసిన కుక్క.. వీడియో వైరల్..