Manjima Mohan : మన అభద్రతా భావాల్ని అంగీకరించాలి.. మంజిమా మోహన్ కామెంట్స్ వైరల్?

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ మంజిమ మోహన్‌ ( Manjima Mohan )గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తమిళ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ తెరకెక్కించిన సాహసం స్వాసగా సాగిపో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంజిమ మోహన్‌.

ఈ సినిమాలో నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా నటించిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ డిజాస్టర్ గా నిలిచింది.

అయినప్పటికీ హీరోయిన్ మంజిమ మోహన్ కి మంచి గుర్తింపు దక్కింది.తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

"""/" / ఈ సినిమా తర్వాత ఆమె ఎన్టీఆర్( NTR ) హీరోగా నటించిన కధానాయకుడు, మహానాయుకుడు సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది.

కాగా ఈ సినిమాల తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవటంతో తమిళ సినిమాలకే పరిమితం అయ్యారు.

ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు కార్తీక్‌( Actor Karthik ) కుమారుడు గౌతమ్‌ కార్తీక్‌తో( Gautham Karthik ) ప్రేమలో పడింది.

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు గత ఏడాది అనగా 2022 డిసెంబర్ లో మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

కాగా పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.

"""/" / సినిమాలలో నటించకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తనకూ తన భర్తకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అప్పుడప్పుడు అభిమానులతో లైవ్ చాట్,చిట్ చాట్ కూడా నిర్వహిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఒక పోస్టు చేసింది.

ఆ పోస్టులో ఈ విధంగా రాసుకొచ్చింది.మనం ముందుగా.

అతి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే.మన అభద్రతా భావాల్ని అంగీకరించాలి.

అవి చాలా సాధారణమైనవని అర్థం చేసుకోవాలి.వాటిని దూరం చేసుకోవటానికి పని చేయాలి.

కొన్ని సార్లు అందుకు కొంత సమయం పడుతుంది.కానీ, చాలా ఓపిగ్గా ఉండాలి అని రాసుకొచ్చింది.

ప్రస్తుతం అందుకు సంబందించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా ఆ ట్వీట్ చూసిన నెటిజన్స్ ఆమె ఏ విషయంలో అభద్రతా భావానికి గురవుతుందో తెలియడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అక్రమంగా ఉంటున్నారా.. విదేశీయులకు దుబాయ్ మరో ఛాన్స్, రంగంలోకి ఇండియన్ ఎంబసీ