పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి క్రీడా పోటీలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంటు లో భాగంగా రుద్రంగి మండలంలోని పోలీసుల ఆధ్వర్యంలో మండల స్థాయి కబడ్డీ, వాలీబాల్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్నట్టు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు.

రుద్రంగి మండల స్థాయి టోర్నమెంట్ లో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఒక కబడ్డీ,ఒక వాలీబాల్ టీం కి అవకాశం ఇస్తున్నామని ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ యొక్క టీం వివరాలు పోలీస్ స్టేషన్ లో తెలుపగలరని కోరారు.

మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు జట్ల ను జిల్లా స్థాయికి సెలెక్ట్ చేస్తామని తెలిపారు.

9492195025 ఈ నెంబర్ కి ఫోన్ చేసి తమ టీం యొక్క వివరాలు తెలపగలరని కోరారు.

హత్రాస్లో 121కి చేరిన మృతుల సంఖ్య.. పరారీలో భోలే బాబా..