ఆ ఇద్దరితో సినిమా చెయ్యాలని చాలా ట్రై చేశా.. కానీ..
TeluguStop.com
తెలుగులో ప్రముఖ సినీ దర్శకుడు శాజీ కైలాస్ దర్శకత్వం వహించిన విష్ణు అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయమైన ప్రముఖ హీరో మంచు విష్ణు గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి కొత్త గా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే నటుడు మంచు విష్ణు గతంలో దేనికైనా రెడీ, పాండవులు పాండవులు తుమ్మెద, ఈడోరకం ఆడోరకం, ఢీ తదితర చిత్రాలతో ప్రేక్షకులను బాగానే అలరించాడు.
కానీ ఈ మధ్య కాలంలో కథల పట్ల సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.
కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సినిమా ఇండస్ట్రీలోని తన స్నేహితులు మరియు మల్టీస్టారర్ చిత్రాలకు సంబందించిన విషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
/b
అయితే ఇందులో భాగంగా తనకు తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ మరియు యంగ్ హీరో నితిన్ మంచి స్నేహితులని తెలిపాడు.
దాంతో వారిద్దరితో కలిసి సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని కానీ తమకు తగ్గట్టు కథ దొరకలేదని దాంతో ఇప్పటికీ తన కల కలగానే ఉండిపోయిందని చెప్పుకొచ్చాడు.
అలాగే గతంలో తాను రాజ్ తరుణ్ హీరోగా నటించిన ఈడోరకం ఆడోరకం చిత్రంలో మొదటగా కళ్యాణ్ రామ్ లేదా నితిన్ లను నటింపజేయాలని అనుకున్నప్పటికీ పలు అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదని తెలిపాడు.
అలాగే నితిన్ చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుని స్టార్ హీరోగా ఎదిగాడని అందుకే నితిన్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
అంతేకాకుండా నితిన్ ఇండస్ట్రీలో హిట్ కొడితే తనకు హిట్ వచ్చినంత ఆనందం కలుగుతుందని కూడా తెలిపాడు.
"""/"/
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే మంచు విష్ణు తెలుగులో మోసగాళ్ళు అనే చిత్రంలో హీరోగా నటించాడు.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.దాంతో ఈ చిత్రం కారణంగా మంచు విష్ణు దాదాపుగా 30 కోట్ల రూపాయల నష్టపోయినట్లు సమాచారం.
దీంతో ప్రస్తుతం మంచు విష్ణు తన సినిమాకు కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడ.
హెజ్బొల్లా అధినేత నస్రల్లా హతం.. ఇజ్రాయెల్పై డొనాల్డ్ ట్రంప్ అల్లుడు ప్రశంసలు