నా కుటుంబాన్ని ఓ నటుడు టార్గెట్ చేశాడు, ఇకపై సహించేది లేదు: మంచు విష్ణు

టాలీవుడ్ హీరో మంచు విష్ణు తాజాగా నటించిన చిత్రం జిన్నా.ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంచు విష్ణు సరసన సన్నిలియోన్ పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్ లుగా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను త్వరలోనే విడుదల కానుంది.ఈ సందర్భంగా చిత్ర బంధం అప్పుడే ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసింది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో బంగా పాల్గొన్న మంచి విష్ణు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ.సంచలన వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల్లో తన పై దారుణంగా ట్రోల్స్ చేశారని మా ఫ్యామిలీని టార్గెట్ చేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

దీని వెనకాల ఓ స్టార్ హీరో ఉన్నారని మంచు విష్ణు ఆరోపించారు.మా కుటుంబంపై ట్రోల్స్ చేసేందుకు ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నెలకొల్పారు అంటూ మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేసారు.

నా ఫ్యామిలీపై ట్రోల్స్ చేసినవారి పైన సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు.

అంతే కాకుండా దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఐపీ అడ్రస్‌లు పోలీసులకు అందజేస్తానని ఆయన వెల్లడించారు.

"""/"/ ఇన్ని రోజులు అన్నీ భరించానని ఇకపై సహించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు మంచు విష్ణు.

అయితే మంచి విష్ణు మాటలను బట్టి చూస్తుంటే ఈ విషయం పట్ల చాలా సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే మంచు విష్ణు నటించిన జిన్నా సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా అక్టోబర్ 5న విడుదల చేస్తాము అని చిత్రముందే ముందే ప్రకటించినప్పటికీ ఆ తర్వాత విడుదల తేదిని మర్చి ఈ సినిమా తేదీని మళ్లీ ప్రకటిస్తాం అని తెలిపారు.

తాజాగా జిన్నా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న మంచు విష్ణు ఈ సినిమాను అక్టోబర్ 21న విడుదల చేయనున్నట్లు ముందుగా ప్రకటించేశారు.

అలాగే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఆ బామ్మ డోర్‌స్టాప్ విలువ రూ.9 కోట్లు.. అయినా ఏం లాభం..?