ఇంకా పిల్లల్ని కందామా అంటే విష్ణు భార్య అలా అన్నారట.. ఏం జరిగిందంటే?

మంచు మోహన్ బాబు తనయుడిగా, నటుడిగా మంచు విష్ణు ప్రేక్షకుల్లో గుర్తింపుతో పాటు అభిమానులను సొంతం చేసుకున్నారు.

ఈ మధ్య కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించి మంచు విష్ణు వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

తాజాగా మంచి విష్ణు అలీతో సరదాగా షోకు గెస్ట్ కు హాజరయ్యారు.అలీ మంచు విష్ణు బాబు అని పిలవగా బాబోయ్ మీరు కూడానా అని అలీ అన్నారు.

150వ ఎపిసోడ్ కు మోహన్ బాబు ట్రై చేయగా తెలుసుకదయ్యా కరోనా అని ఆయన అన్నారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

మనిద్దరికీ కామన్ గా సొట్టబుగ్గలు ఉన్నాయని మనోజ్ కు కూడా ఉంది కదా అని అలీ అడగగా అవును వాడికి కూడా ఉందని విష్ణు చెప్పారు.

మంచు ఫ్యామిలీలో పుట్టినందుకు గర్వపడుతున్నావా.? బాధ పడుతున్నావా.

? అని చెప్పగా భారతదేశం గర్వించదగ్గ 15 మంది నటులలో మోహన్ బాబు కూడా ఒకరని విష్ణు వెల్లడించారు.

మోహన్ బాబు కొడుకుగా ఒకటి రెండు సినిమాలలో అవకాశాలు రావచ్చని టాలెంట్ ఉంటే మాత్రమే మిగిలిన సినిమాల్లో ఆఫర్లు వస్తాయని విష్ణు కామెంట్లు చేశారు.

టాలెంటె ఉండబట్టే కదా తాను అలీతో సరదాగా షోలో ఉన్నానని విష్ణు వెల్లడించారు.

అక్క చేసిన పనిలో 10 శాతం నేను లేదా మనోజ్ చేస్తే నాన్న తోలు తీసేస్తారని విష్ణు పేర్కొన్నారు.

తండ్రికి కూతురు వీక్ నెస్ అని పిల్లలు పుట్టిన తర్వాతే అర్థమైందని విష్ణు చెప్పుకొచ్చారు.

"""/"/ తన వైఫ్ ను మొదటిసారి వాళ్ల ఇంట్లో చూశానని నాకు ఈరోజుకు ఆ అమ్మాయి నవ్వు గుర్తు ఉందని విష్ణు తెలిపారు.

ఆ సమయంలో నాన్న గుర్తుకు రాలేదని విష్ణు వెల్లడించారు.విన్నీ ఎక్కువ మంది కిడ్స్ కావాలంటే ఇంకా ఎవరినైనా చూసుకోపో అని చెప్పారని విష్ణు పేర్కొన్నారు.

విలువలు లేని రాజకీయాలు చేయను.. హరీశ్ రావు కామెంట్స్