వాక్సిన్ వేసుకున్న అని చెప్పి తెలంగాణ సర్కార్ ని ఇరుకున పెట్టిన మంచు లక్ష్మి

మంచు మోహన్ బాబు కూతురుగా టాలీవుడ్ లో అందరికి పరిచయం ఉన్న మంచు లక్ష్మి ఇప్పటికే నటిగా తనని తాను ప్రూవ్ చేసుకుంది.

అలాగే టెలివిజన్ టాక్ షోలతో వాఖ్యతగా కూడా సక్సెస్ అయ్యింది.అయితే చాలా కాలంగా ఆమె పెద్దగా సినిమాలు చేయడం లేదు.

కాని సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు మంచు లక్ష్మి యాక్టివ్ గా ఉంటుంది.

ఓ యుట్యూబ్ చానల్ స్టార్ట్ చేసి అందులో చాలా విషయాలని పంచుకుంటుంది.ఎక్కువ సమయం తన కూతురుతో స్పెండ్ చేస్తుంది.

నార్త్ నుంచి వచ్చే హీరోయిన్స్ చాలా మంది మంచు లక్ష్మితో మంది ఫ్రెండ్ షిప్ మెయింటేన్ చేస్తారు.

రకుల్ ప్రీత్ సింగ్, తాప్సి, తమన్నా, కాజల్ అగర్వాల్ అందరూ మంచు లక్ష్మికి మంచి ఫ్రెండ్ అనే విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే అప్పుడప్పుడు మంచువారమ్మాయి తన పనులు, ట్వీట్స్, మాటలతో ట్రోల్స్ కి గురవుతూ ఉంటుంది.

ఆమె తెలుగు ఉచ్చారణ మీద సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్ వస్తూ ఉంటాయి.

అలాగే ఆమె ట్వీట్స్ ని కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉంటారు.తాజాగా ఆమె చేసిన ఒక పోస్ట్ తెలంగాణ సర్కార్ ని ఇరుకున పెట్టేలా ఉందని నెటిజన్స్ ట్రోల్స్ చేశారు.

యశోదా హాస్పిటల్ లో తాను కరోనా మొదటి వాక్సిన్ వేయించుకున్నానని పోస్ట్ చేసింది.

దీనిపై నెటిజన్లు ట్రోల్స్ మొదలు పెట్టారు.తెలంగాణ సర్కార్ వాక్సిన్ మొదటి డోస్ వేయడం ఆపేసినట్లు ప్రకటించింది.

కేవలం రెండో డోస్ మాత్రమే వేస్తున్నట్లు చెప్పింది.మరి మంచు లక్ష్మి మొదటి డోస్ వాక్సిన్ ఎలా వేసుకుంది.

ఈమెకి మాత్రమే టీఆర్ఎస్ స్పెషల్ గా డోస్ పంపిణీ చేసిందా అంటూ కామెంట్స్ చేశారు.

కరోనా విషయంలో కూడా సామాన్యుల నుంచి సెలబ్రిటీలని వేరు చేస్తున్నారా అంటూ విమర్శలు చేస్తున్నారు.

తెలుగులో గోపీచంద్, తమిళంలో విశాల్‌.. ఇద్దరూ చెత్త సినిమాలతో బుర్ర తినేస్తున్నారుగా ..?