మనఊరు మనబడి పనుల త్వరితగతిన పూర్తి చేయాలి:డిఇఓ

సూర్యాపేట జిల్లా: మనఊరు మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి అశోక్ సూచించారు.

బుధవారం హుజూర్ నగర్ మండలంలింగగిరి ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల మరియు హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మనఊరు మనబడి పనులను పర్యవేక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మనఊరు మనబడి కింద చేపట్టబడిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు.

ప్రధానోపాధ్యాయులకు ఏఈ,కాంట్రాక్టర్లకు తగిన సలహాలు,సూచనలు చేశారు.అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుజూర్ నగర్ నందు ఉపాధ్యాయులతో పదవ తరగతి పరీక్ష ఫలితాల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు.

100% విద్యార్థులు పాస్ అయ్యేటట్లు చూడాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి భూక్య సైరా నాయక్, ప్రధానోపాధ్యాయులు మల్లెల ఉదయశ్రీ,సామల వెంకట్ రెడ్డి,తాతరాజు శ్రీనివాస్,లోకసాని శ్రీనివాసరెడ్డి,మాతంగి ప్రభాకర్ రావు, యరబోయిన ఉపేందర్, ఆరె వసంతరావు,అన్వేష్, శేషగిరి,వెంకటేశ్వర్లు అరుణరాణి,జానీ బేగం, అశోక్ కుమార్,జ్యోతి,సి ఆర్ పి సైదులు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పులికి వణుకు పుట్టించిన ఎలుగుబంటి.. వీడియో వైరల్‌..