చనిపోయిన భార్యకు కర్మకాండ నిర్వహించిన భర్త.. కానీ, భర్త ముందు ప్రత్యక్షమైన భార్య.. అసలు ఏమైందంటే?

నిజా నిజాలు ఎన్నటికీ దాగదు అంటారు.అది ఒక్కరోజైనా, సంవత్సరమైనా.

నిజం ఒక రోజు వెలుగులోకి వస్తుంది.అలాంటి ఉదంతమే కర్ణాటక రాష్ట్రం( Karnataka ) కొడగు జిల్లా బసవనహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పెళ్లైన ఓ మహిళ భర్త, పిల్లలను వదిలి ప్రియుడితో పరారై, తాను చనిపోయినట్టు నమ్మించి భర్త చేతే అంత్యక్రియలు చేయించుకుని, చివరికి మళ్లీ మూడు సంవత్సరాల తర్వాత ప్రత్యక్షమవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

బసవనహళ్లికి చెందిన సురేశ్,( Suresh ) మల్లిగె( Mallige ) అనే వివాహిత దంపతులుగా జీవనం సాగించేవారు.

వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.వీరి జీవితం సాదాసీదాగా సాగిపోతున్నప్పటికీ, మల్లిగెకి మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ నేపథ్యంలో, ఆమె తన ప్రియుడితో కలిసి ఇంటినుంచి పారిపోయింది.తన భార్యను తిరిగి తెచ్చేందుకు సురేశ్ ప్రయత్నాలు చేశాడు.

ఆమెను ఫోన్ చేసి, “నాతో జీవించకున్నా పరవాలేదు, కానీ పిల్లలను చూసుకోవడానికైనా రావాలి” అని మనవి చేశాడు.

కానీ ఆమె స్పందించలేదు.దీనితో, 2021లో సురేశ్ కుశాలనగర పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది.

2022లో పోలీసులు సురేశ్‌కు ఒక శవం లభించిందని, అది మల్లిగెదిగా అనుమానం వ్యక్తం చేశారు.

అతడి అత్త గౌరి, సురేశ్‌తో కలిసి బెట్టదపురలో ఉన్న అస్తిపంజరాన్ని పరిశీలించి, “ఇది మా అమ్మాయిదే” అని ధృవీకరించారు.

దాంతో, అక్కడే అంత్యక్రియలు నిర్వహించబడ్డాయి. """/" / అంతే కాదు, గౌరి "అల్లుడే మా అమ్మాయిని చంపేశాడు" అని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, సురేశ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.

రెండేళ్ల పాటు సురేశ్ నిర్దోషిగా జైలు జీవితం గడిపాడు.అయితే, DNA పరీక్షల రిపోర్ట్ అనంతరం శవం మల్లిగెదే కాదని నిర్ధారణ అయింది.

దాంతో, సురేశ్‌ను జైలునుంచి విడుదల చేశారు.ఈ కథ ముగిసిందనుకుంటున్న సమయంలోనే 2025, ఏప్రిల్ 1వ తేదీ మళ్లీ కొత్త మలుపు తిరిగింది.

మల్లిగె తన ప్రియుడితో కలిసి మడికేరిలోని( Madikeri ) ఓ హోటల్‌లో ప్రత్యక్షమైంది.

సురేశ్ స్నేహితులు ఆమెను గుర్తించి ఫోటోలు తీసి పోలీసులకు సమాచారం అందించారు.వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు మల్లిగెను అదుపులోకి తీసుకున్నారు.

"""/" / పోలీసుల విచారణలో మల్లిగె మాట్లాడుతూ, "నేను ప్రియుడితో ఇష్టపూర్వకంగా వెళ్లాను" అని చెప్పింది.

ఆమెను అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచి, మైసూరు జైలుకు తరలించారు.ప్రస్తుతం మరో ప్రశ్న పోలీసుల ముందుంది.

భర్త చేసిన అంత్యక్రియలు ఎవరి శవానికి.? దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.

ఈ సంఘటన సామాన్యమైనది కాదు.ప్రేమ, నమ్మకం, మోసం, శోకం, అన్యాయం అన్నీ ఒక్కటే కధలో కలగలిసిపోయాయి.

ఒక అమాయక భర్త జైలులో కాలాన్ని గడపడం, రెండు చిన్న పిల్లలు తల్లిదొరకకుండా ఉండడం, చివరికి చనిపోయిందనుకున్న భార్య తిరిగి ప్రత్యక్షం కావడం.

ఇవన్నీ కలిసొస్తే సినిమాలోను చూడనంత నాటకీయ పరిణామాలు.ఇప్పుడు సురేశ్ కోసం కొత్త జీవితానికి న్యాయం మొదలవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.