పరోక్షంగా సుధీర్, గెటప్ శ్రీనులను ఆహ్వానిస్తున్న మల్లెమాల.. రీ ఎంట్రీ ఇవ్వనున్నారా?

బుల్లితెరపై అత్యంత ఆదరణ సంపాదించుకుని దూసుకుపోతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ కార్యక్రమం ఒకటి.

అయితే జబర్దస్త్ కార్యక్రమానికి హైపర్ ఆది ఎంతో కీలకంగా ఉండగా ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి సుడిగాలి సుదీర్ టీమ్ అంతే కీలకంగా ఉంది.

ఇకపోతే తాజాగా సుడిగాలి సుదీర్ హైపర్ ఆది గెటప్ శ్రీను జబర్దస్త్ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో వీరు లేని వెలితి స్పష్టంగా కనబడుతోంది.

అయితే వీళ్ళు బయటకు పోవడానికి సరైన కారణం తెలియకపోయినప్పటికీ వీరు తిరిగి ఈ కార్యక్రమంలోకి వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు.

ఇకపోతే మల్లెమాల వారితో వీరికి అభిప్రాయ భేదాలు వచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

కానీ మల్లెమాల మాత్రం ఈ నింద వారిపై వేసుకోకుండా పరోక్షంగా వీరికి సినిమా అవకాశాలు రావడంతో వెళ్లారని ఒక స్కిట్ ద్వారా తెలియజేశారు.

ఇకపోతే తాజాగా మరొక స్కిట్ ద్వారా మల్లెమాల వారు పరోక్షంగా సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీనులను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.

గత వారం ప్రసారమైన కార్యక్రమంలో భాగంగా సుడిగాలి సుధీర్ టీమ్ ఫ్రెండ్ షిప్ గురించి రాకింగ్ రాకేష్ స్కిట్ రూపంలో తెలియచేశారు.

ఇక రాకేష్ చేసిన ఈ స్కిట్ చూసి వేదికపై అందరూ ఎంతో ఎమోషనల్ అవుతూ ఏడ్చేశారు """/" /.

ఇక ఇంద్రజ ఈ స్కిట్ గురించి మాట్లాడుతూ తిరిగి మీ ముగ్గురిని ఈ వేదికపై చూడాలని నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ ఎమోషనల్ కాగా రాంప్రసాద్ సైతం ఇద్దరు వదిలి వెళ్ళిపోవడంతో ఒంటరి అయ్యా అంటూ ఎమోషన్ అయ్యారు.

ఇంద్రజ చెప్పిన మాటలను బట్టి చూస్తే మల్లెమాల వారు పరోక్షంగా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీనులను తిరిగి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే మల్లెమాల వారు రిక్వెస్ట్ చేస్తే గెటప్ శ్రీను,సుడిగాలి సుదీర్ తిరిగి రీఎంట్రీ ఇస్తారా లేక శాశ్వతంగా ఈ కార్యక్రమానికి దూరం అవుతార అనేదీ తెలియాల్సి ఉంది.

నితిన్ కి భారీ నష్టాన్ని మిగిల్చిన సినిమా ఏంటో తెలుసా..?