సౌదీ లో మల్లాపూర్ వాసి గుండె పోటు తో మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నడి గొట్టు రాజేశం( Nadi Gutu Rajesh ) (45,) సౌదీలో గుండెపోటుతో బుధవారం రోజు ఉదయం మరణించినట్లు స్థానికులు తెలిపారు.

బతుకు దెరువు కోసం దేశం కానీ దేశం పోయి అక్కడ మృత్యువాత పడటం తో గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతుడికి బార్య భారతి, కుమారుడు, కూతురు ఉన్నారు.ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని సర్పంచ్ ఇళ్ళందుల శంకర్ తెలిపారు.

దొంగతనానికి వచ్చాడు.. బుక్ కనిపించడంతో అది చదువుతూ చోరీ గురించే మర్చిపోయాడు..?