ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్…!

కరోనా మూలాన అందరూ ఖాళీ పడిపోయారు.ఇంచుమించు అందరికీ పని లేకుండా పోయింది.

ఇక ఈ ఖాళీ సమయంలో క్రికెట్ ప్రియులు లైవ్ క్రికెట్ లేక పాత మ్యాచ్ లనే పదే పదే చూసి బోర్ ఫీల్ అయిపోయారు.

ఇలాంటి తరుణంలో ఐపీఎల్ 2020 సీజన్‌ స్టార్ట్ అవుతోంది అనే వార్త వీరికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.

కానీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందే వీరి ఆనందం పైన నీళ్లు జల్లే వార్తలు పుట్టుకొస్తున్నాయి.

అవును.కొన్ని రోజులుగా ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

కరోనా కష్ట కాలంలో కూడా ఎంతో కట్టుదిట్ట చర్యలతో సిరీస్ మొదలు పెట్టాలని అనుకుంటుండగా.

ఆటగాళ్ల నుంచి ఆయా ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఇక ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ నుంచి సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ దూరం ఆయా టీములకు హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసినదే.

తాజాగా ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా ఇలాంటి షాకే తగలడం కొసమెరుపు.శ్రీలంక స్టార్ బౌలర్ మలింగ్ ఇపుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాను ఈ సీజన్‌లో ఆడటం లేదని తెగేసి చెప్పాడు.వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ ఐపీఎల్ ‌కు రావడం లేదని చెప్పి జట్టుకు షాక్ ఇచ్చాడు.

ఆయన నిర్ణయంతో ముంబై ఇండియన్స్ ఫాన్స్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు.ముంబై ఇండియన్స్ కూడా ఈ విషయాన్ని తాజాగా ధ్రువీకరించడం గమనార్హం.

మలింగ స్థానంలో మరో పేసర్‌ ఆస్ట్రేలియాకు చెందిన జేమ్స్ ప్యాటిన్సన్‌ను తీసుకుంది.ఇలా స్టార్ ఆటగాళ్లు వరుసగా ట్విస్ట్ ఇవ్వడం ఇప్పుడు ఐపీఎల్ ఆసక్తిగా మారింది.

వీడియో: స్విమ్మింగ్ పూల్‌లో స్టంట్.. కట్ చేస్తే యువకుడు డెడ్?