అర్ధరాత్రి.. కానిస్టేబుల్ ప్రశ్నలు.. మనసు ఎంతో గాయపడింది: హీరోయిన్

మలయాళ నటి అయినా అర్చనా కవి తాజాగా తనతో ఒక పోలీస్ కానిస్టేబుల్ దురుసుగా ప్రవర్తించారు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలపడంతో, ఆ విషయం పట్ల సదరు కానిస్టేబుల్ ని అంతర్గతంగా విచారిస్తున్నట్లు కొచ్చి డీఎస్పీ వెల్లడించారు.

అయితే ఆ సమయంలో తనకు ఎదురైన ఆ చేదు అనుభవం గురించి సోషల్ మీడియా ద్వారా పంచుకుంది నటి అర్చన కవి.

అసలేం జరిగిందంటే.ఆమె తన ఫ్యామిలీ ఫ్రెండ్ అలాగే ఇద్దరు పిల్లలు కలిసి సరదాగా బయటికి వెళ్లారట.

అయితే ఆటోలో 11:00 సమయంలో తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కొచ్చి కానిస్టేబుల్ పెట్రోలింగ్ లో భాగంగా ఆమె వస్తున్న ఆటోని ఆపారట.

ఆ తర్వాత అతడు పోలీస్ కానిస్టేబుల్ ఆమెను ఎక్కడి నుంచి వస్తున్నారని ఈ పిల్లలు ఎవరు?ఎక్కడ నుండి తీసుకువస్తున్నారు?అంటూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగి వేదించాడట.

కానీ ఆమె ఎంత చెప్పినా కూడా సదరు కానిస్టేబుల్ వినిపించుకోలేదట.అంతేకాకుండా ఆమెను పిచ్చి పిచ్చి ప్రశ్నలు, ఇబ్బందికర ప్రశ్నలు వేసి విధించారట.

తనకు జరిగిన ఆ సంఘటన తాను ఎంతో వేధించింది అని చెప్పుకొచ్చింది అర్చన కవి.

అయితే ఈ విషయంపై తాను పోలీసులను నిందించడం లేదని ఎందుకంటే వారి డ్యూటీ చేస్తున్నారని, కాకపోతే ఆ సమయంలో ఆయన వ్యవహరించిన తీరు తనను నిజంగానే బాధ కలిగించింది అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

"""/" / అయితే ఈ విషయంపై వచ్చి కొచ్చి డీసీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై అంతర్గత విచారణ జరుపుతున్నామని, సినీనటి అలాగే కానిస్టేబుల్ ఇద్దరి వాదనలు విన్నానని, రాత్రి సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ వారిని ఆపి ప్రశ్నించారని, అయితే ఆ సమయంలో ఆ నటి తన ముఖానికి మాస్కు పెట్టుకోవడం వల్ల కానిస్టేబుల్ ఆమెను గుర్తు పట్టలేకపోయారని, ఆ పరిస్థితుల్లో నటి ఉన్న సాధారణ మహిళ ఉన్నా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారి దురుసుగా ప్రవర్తించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు డిసిపి.

ప్రభాస్ హను రాఘవ పూడి సినిమాలో నటించనున్న యంగ్ హీరో…