హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి నటి కూతురు.. ఆమె ఎవరంటే?
TeluguStop.com
బాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి మాలా శ్రీ , నిర్మాత దివంగత రాము ల కుమార్తె రాథనా రామ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది.
దర్శన్ తో కలిసి D56 అనే వర్కింగ్ టైటిల్ తో పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ తెరకెక్కబోతోంది.
ఈ సినిమాకు తరుణ సుధీర దర్శకత్వం వహిస్తుండగా, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తన రాక్ లైన్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా ఈ సినిమా తెలుగు,కన్నడ,మలయాళం,తమిళం,హిందీ భాషల్లో తెరకెక్కబోతోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాను బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ప్రారంభించారు.
అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
కాగా నటి మాలా శ్రీ తెలుగులో పలు సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
తన నటనతో పాటు అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది మాల శ్రీ.
అలాగే లేడీ ఓరియెంటెండ్ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.కాగా ప్రస్తుతం మాలాశ్రీ కుమార్తె రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.
బెంగళూరులో ఈ సినిమాను ప్రారంభించిన తర్వాత నటి మాలాశ్రీ మాట్లాడుతూ. """/" /
రాథనా రామ్ కు శుభాకాంక్షలు.
ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి.రాక్లైన్ నా సినిమాతో ప్రొడక్షన్లోని అడుగుపెట్టారు.
ఇప్పుడు రాక్లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా ఎంట్రీ ఇస్తోంది.
మంచి టీమ్తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు నాకు చాల సంతోషంగా ఉంది.చిన్నప్పటి తను నుంచి నటి కావాలనుకుంది అని చెప్పుకొచ్చింది మాలా శ్రీ.
అయితే రాథనా రామ్ నటనపై ఉన్న ఆసక్తితో ముంబైలో నటన డాన్స్ నేర్చుకుందట.