కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి – గంభీరావుపేట మండల అధ్యక్షులు హమీద్

రాజన్న సిరిసిల్ల జిల్లా: డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ కి మద్దతుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేయాలని గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ పిలుపునిచ్చారు.

గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గంభీరావుపేట మండల అధ్యక్షుడు హమీద్ పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ నెల 14వ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సిఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కి మద్దతుగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయవలసిందిగా కోరారు.

ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ దేశంలోని సంపదను ప్రజా ఆస్తులను ఆదానీలకు అంబానీలకు దారాదత్తం చేస్తూ దేశంలో జరుగుతున్న అవినీతిపై నిండు పార్లమెంట్లో నిలదీసినందుకు అక్రమ కేసులు పెట్టి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించడంలో అదే విధంగా తీర్పు వచ్చిన 24 గంటల్లో రాహుల్ గాంధీ యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దుచేసి కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని హమీద్ మండిపడ్డారు.

ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరి ముఖ్యంగా దేశ ప్రజలు రాహుల్ గాంధీ కి మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాహుల్ గాంధీ కి మద్దతుగా జరగబోయే సభను సామాన్య ప్రజలు కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున బయలుదేరి వెళ్లి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా తెలిపారు.

ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా అఖిలభారత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, అదే విధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షుడు పాపా గారి రాజు గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గంగి స్వామి, ఓరుగంటి నర్సింలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంగం రాజు, శ్రీనివాస్, మొహమ్మద్ తాహెర్, తదితరులు పాల్గొన్నారు.

రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్న మన స్టార్ హీరోల సినిమాలు…