వచ్చే ఎన్నికల్లో మెజార్టీ పోటీ చేస్తాం.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

ఈ క్రమంలో ఎక్కడెక్కడ పోటీ చేస్తామో త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.తమ కౌన్సిలర్లు, నేతలపై కావాలనే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.

కేసీఆర్ కుటుంబం కోసం, కవిత కోసం బోధన్ లో ఎంఐఎం కార్యకర్తలు కష్టపడ్డారని తెలిపారు.

కవిత గెలుపు కోసం కష్టపడిన తమ కార్యకర్తలపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు.తమ పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టిన బోధన్ ఏసీపీ, సీఐ, ఇతర పోలీసులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బోధన్ లో షకీల్ ను ఓడిస్తామని వెల్లడించారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు…