సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్ డేట్ లాక్..!

సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ మూవీ సర్కారు వారి పాట.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మించారు.

మహేష్ GMB ఎంటర్టైన్ మెంట్స్ కూడా సహ నిర్మాతగా ఉన్నారు.మే 12న రిలీజైన ఈ సినిమా అనుకున్న విధంగానే సక్సెస్ అందుకుంది.

మహేష్ సక్సెస్ మేనియాని కొనసాగిస్తూ సర్కారు వారి పాట సినిమా కూడా మహేష్ ఖాతాలో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మహేష్, కీర్తి జోడీకి మంచి మార్కులు పడ్డాయి.

ఇక సినిమాకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

ఇక సర్కారు వారి పాట సినిమా డిజిటల్ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

అమేజాన్ ప్రైమ్ భారీ రేటుకి ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నారు.

సినిమా ను అమేజాన్ ప్రైమ్ జూన్ 10న లేదా జూన్ 24న సినిమా ఓటీటీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.

థియేట్రికల్ రన్ లో 200 కోట్ల గ్రాస్ తో మరోసారి సూపర్ స్టార్ మహేష్ సత్తా చాటాడు.

సర్కారు వారి పాట హిట్ జోష్ లో ఉన్న మహేష్ తన నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో ఫిక్స్ చేసుకున్నాడు.

త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.

నాన్నను అలా చూడటం నాకు ఇప్పటికీ గుర్తుంది.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ వైరల్!