మహేష్‌కు మర్చిపోకుండా చేస్తున్న 2020

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం 2020 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది.

ఈ సినిమాతో మహేష్ తన కెరీర్‌లో అదిరిపోయే హిట్ అందుకోవడంతో తన నెక్ట్స్ చిత్రాన్ని ఇటీవల అనౌన్స్ చేశాడు.

గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాకు సర్కారు వారి పాట అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టి చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఇక ఈ సినిమా షూటింగ్‌ను తొలుత వేసవిలో ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే సూచన కనిపించ లేదు.

ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్‌లకు అనుమతి లభిస్తుండటంతో ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

కానీ కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఇప్పట్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దంటూ చిత్ర యూనిట్‌కు మహేష్ తెలిపాడు.

ఈ లెక్కన ఈ సినిమాను వచ్చే ఏడాదిలోనే ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే 2020లో మహేష్ షూటింగ్ దాదాపు చేసుకోకపోవచ్చని తెలుస్తోంది.

సర్కారు వారి పాట సినిమాను గనక 2021లో ప్రారంభిస్తే, మహేష్ ఈ ఏడాదిలో కెమెరా ముందుకు రానట్టే లెక్క.

మహేష్ కెరీర్‌లో ఇలా ఓ ఏడాది పాటు కెమెరా ముందుకు రాకపోవడం కేవలం 2020లోనే జరగనుందని ఆయన అభిమానులు అంటున్నారు.

మరి సర్కారు వారి పాట చిత్ర షూటింగ్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశం మాత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

కాశ్మీర్ వేర్పాటువాద జెండాలను అనుమతించొద్దు : రట్జర్స్ వర్సిటీకి ప్రవాస భారతీయ సంఘాల విజ్ఞప్తి