మహేష్ నెక్స్ట్ కోసం ఆల్ సెట్.. షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ అంటే?

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయిన్ నే వేరు.

సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.

ఇక ఇప్పుడు ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

సర్కారు సినిమా కరోనా కారణంగా ఇన్నాళ్ల సమయం తీసుకుంది.థియేటర్స్ లోకి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.

ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందించాడు.ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్న వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

ఇకపోతే మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.

"""/"/ ఒక వైపు దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా గురించి చర్చిస్తూనే మరో వైపు ఇప్పటికే లాంచ్ చేసిన త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ జులై నుండి స్టార్ట్ కాబోతుందట.ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ను కూడా లాక్ చేశారట.

జులై లో ఈ సినిమాను స్టార్ట్ చేయడానికి కావాలన్సిన అన్ని పనులను పూర్తి చేసారట.

"""/"/ ఈ సినిమా జులై లో స్టార్ట్ అయ్యి డిసెంబర్ నాటికీ టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేయాలి అన్నది ప్లాన్.

2023 సంక్రాంతి లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారట.అందుకే ఈ లోపు ఈ సినిమాను పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ ప్లాన్ గీస్తున్నాడట.

ఇక ఈ సినిమా పూర్తి అయినా తర్వాత అప్పుడు రాజమౌళి సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇది మహేష్ తొలి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న నేపథ్యంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం..: సజ్జల