SSMB28 : యాక్షన్ సీక్వెన్స్ తోనే రంగంలోకి దిగబోతున్న మహేష్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అలాగే కలెక్షన్స్ కూడా పోటీ లేకపోవడంతో దూసుకు పోతున్నాడు.

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.అయితే ప్రెసెంట్ మహేష్ అమెరికా వెళ్ళాడు.

అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించుకుని ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లనున్నారు.

మహేష్ కెరీర్ లో 28వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్ తో పాటు మంచి ఎమోషన్స్ కలగలిపి ఉండేలా త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ కు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ జులై లో స్టార్ట్ కానుంది.మరి ఈ సినిమా ఎలాంటి సన్నివేశలతో మొదలు పెట్టబోతున్నారు అనే వార్త నెట్టింట జోరుగా ప్రచారం సాగుతుంది.

"""/"/ వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు మంచి యాక్షన్ ఎపిసోడ్స్ తో స్టార్ట్ అయ్యాయి.

ఇక ఇప్పుడు SSMB28 కూడా అదే విధంగా మంచి యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్.

త్రివిక్రమ్ స్టైల్ లో లాజిక్స్ తో ఈ యాక్షన్ సన్నివేశాలు చేయబోతున్నట్టు తెలుస్తుంది.

ఇక ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఈ సినిమాను 2023 సంక్రాంతి లో విడుదల చేయాలనీ అనుకుంటున్నారు.

కాంకేర్ ఎన్‎కౌంటర్‎తో ఏజెన్సీ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్