మహేష్ త్రివిక్రమ్ సినిమా షూట్ పై లేటెస్ట్ అప్డేట్..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్యనే త్రివిక్రమ్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.

వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అతడు సూపర్ హిట్ అవ్వగా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేక పోయింది.

అయితే ఈ రెండు సినిమాలు మహేష్ బాబు లోని మరొక కోణాన్ని బయటకు తీసుకొచ్చాడు త్రివిక్రమ్.

ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఈ సినిమాను త్రివిక్రమ్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

తాజాగా ఈ సినిమాపై మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో షూటింగ్ విషయంలో లేటెస్ట్ వార్త ఒక బయటకు వచ్చింది.

ఈ సినిమా షెడ్యూల్ యూకే లో చిత్రీకరించ బోతున్నారని టాలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న మాట.

ఈ సినిమాలోని కీలకమైన భాగాన్ని యుకె లోనే షూట్ చేయబోతున్నారట.మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వం లో 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.

ఛత్తీస్‎గఢ్‎లో ఘోర రోడ్డుప్రమాదం.. 15 మంది మృతి