మహేష్ బాబు పాట రేపటి నుండే మొదలు కాబోతుంది
TeluguStop.com
సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా రూపొందుతున్న సర్కారు వారి పాట షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కు ముందు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు.
కాని షూటింగ్ ప్రారంభించిన సమయంలో కేసులు మరీ ఎక్కువ అవ్వడంతో నిలిపి వేశారు.
మళ్లీ షూటింగ్ లు పునః ప్రారంభం అవుతున్న ఈ సినిమంలో అంతా బాగానే ఉంది అనే నిర్థారణకు వచ్చిన మేకర్స్ మళ్లీ షూటింగ్ కు వెళ్లబోతున్నారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ ను రేపటి నుండి పునః ప్రారంభించేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.
కీర్తి సురేష్ తో పాటు ముఖ్య తారాగణం ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు.
మహేష్ బాబును ఈ సినిమా లో దర్శకుడు పరశురామ్ చాలా ప్రత్యేకంగా చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
గీత గోవిందం వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత దర్శకుడు పరశురామ్ చేస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగాఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభించి సినిమాను సెప్టెంబర్ చివరి వరకు లేదా అక్టోబర్ లో గుమ్మడి కాయ కొట్టి ముగించాలని భావిస్తున్నారు.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. """/"/ ఇప్పటికే సినిమా ను వచ్చే ఏడాది ఆరంభంలో సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు.
ఇక ఈ సినిమా కు పాటలను థమన్ అందిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది చూడాలి.ఈ సినిమా లో తమిళ స్టార్ నటుడు విలన్ గా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.
అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని అంచనా.
నటుడిగా ఎన్టీఆర్ ను ఎంతో అభిమానిస్తా.. విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!