మహేష్‌ రెండు సినిమాల అప్‌ డేట్ లు అదే రోజు కన్ఫర్మ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా ప్రస్తుతం రూపొందుతున్న సర్కారు వారి పాట మరియు జులైలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్‌ సినిమా కు సంబంధించిన అప్ డే ను మే 31వ తారీకున కృష్ణ బర్త్ డే సందర్బంగా ఇవ్వాలని మొదట భావించారు.

కాని కరోనా కేసుల సంఖ్య భారీగా ఉండటంతో పాటు పరిస్థితులు ఏమాత్రం సరిగా లేవు.

కనుక ఈ సమయంలో వేడుకలు ఏంటీ అనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను ఇప్పట్లో చెప్పకూడదని భావించారు.

కాని పరిస్థితులు కుదుట పడుతున్నాయి.మెల్లగా మళ్లీ మునుపటి వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.

అందుకే మహేష్‌ బాబు మళ్లీ తన సినిమా కు సంబంధించిన అప్‌ డేట్స్ ను ఇచ్చేందుకు మేకర్స్ కు ఓకే చెప్పాడు.

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు రెండు సినిమాలు కూడా ఎప్పుడు వస్తాయి.షూటింగ్‌ అప్ డేట్స్ కు సంబంధించిన విషయాలను వీలైతే పోస్టర్‌ మరియు టైటిల్‌ ను కూడా అనౌన్స్ చేయాలని భావిస్తున్నారు.

మహేష్‌ బాబు మే 31వ తారీకున సర్కారు వారి పాట సినిమా కొత్త పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అనే విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సినిమా కు సంబంధించిన టీజర్ లేదా పోస్టర్ ను విడుదల చేయడం ద్వారా సినిమా పై అంచనాలు మరింతగా పెంచే అవకాశం ఉందంటున్నారు.

ఇక ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన వెంటనే కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల నిలిపి వేశారున అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా ను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేస్తామంటున్నారు.

మొత్తానికి ఈ సినిమా లు రెండు కూడా ఇండస్ట్రీ హిట్స్ గా నిలుస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే ఈ రెండు సినిమా ల విడుదల పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆర్య మూవీ లో ఈ షాట్ కోసం అల్లు అర్జున్ చేసిన పని తెలిస్తే ..?