ఒక వైపు రియల్‌ హీరోయిన్‌ మరో వైపు రీల్‌ హీరోయిన్ తో మహేష్‌

సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా రూపొందుతున్న సినిమా సర్కారు వారి పాట.

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతన్న విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే.

స్పెయిల్ లో సినిమా కు సంబంధించిన ఒక రొమాంటిక్ పాట చిత్రీకరణ లో మహేష్ బాబు పాల్గొంటున్నాడు.

ఇదే సమయంలో స్పెయిల్‌ లో మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉన్నారు.నమ్రత మరియు పిల్లలు అక్కడే మహేష్ బాబుతో సరదాగా హాలీడే ను ఎంజాయ్‌ చేస్తున్నారు.

ఒక వైపు మహేష్‌ బాబు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరో వైపు వారితో సరదాగా చిట్ చాట్‌ చేస్తూ హాయిగా ఫ్యామిలీ తో టైమ్‌ స్పెండ్ చేస్తున్నాడు.

ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి దక్కుతుంది కదా అంటూ సోషల్‌ మీడియా లో జనాలు కామెట్స్ చేస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ లో భాగంగా అక్కడ సందడి చేశారు.

కొద్ది సమయం అక్కడ యూనిట్‌ సభ్యులతో మాట్లాడి ఆ తర్వాత అక్కడ నుండి వెళ్లారు.

మహేష్ బాబు ఒకే సారి రియల్‌ హీరోయిన్ నమ్రత తో మరియు రీల్‌ హీరోయిన్ కీర్తి సురేష్ తో రొమాన్స్ చేస్తున్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఇలాంటి అరుదైన అవకాశం ను మహేష్‌ వంటి సూపర్‌ లక్కీ స్టార్స్ మాత్రమే దక్కించుకోగలరు అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న సర్కారు వారి పాట సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.

సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని మొన్నటి వరకు యూనిట్‌ సభ్యులు చెప్పారు.కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా ను వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వచ్చే సమ్మర్ కు సినిమా ను వాయిదా వేస్తారేమో చూడాలి.ఈ సినిమా తర్వాత మహేష్‌ బాబు చేయబోతున్న సినిమా కు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్నాడు.

నామినేషన్ దాఖలు చేసిన కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్ ..