మహేష్‌ బాబు ఫ్యాన్స్‌కు ఇంతకంటే గొప్ప కానుక ఉండదేమో

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.

మరి కొద్ది రోజుల్లోనే షూటింగ్‌ మొత్తం పూర్తి చేయబోతున్నారు.రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని వసూళ్లు చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మహేష్‌బాబు కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించబోతున్న చిత్రం అంటూ రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు.

సినిమా విడుదలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.అయినా కూడా సినిమా ప్రమోషన్‌కు రంగం సిద్దం అయ్యింది.

"""/"/భారీ ఎత్తున అంచనాలున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంకు అనీల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇప్పటి వరకు సినిమా పాటను విడుదల చేయలేదు.మొదటి పాటను డిసెంబర్‌ 1వ తారీకున విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వారంకు ఒక్క పాట చొప్పున డిసెంబర్‌ నెల మొత్తంగా ఒక్కో పాట చొప్పున వారంలో ఒకటి విడుదల చేయబోతున్నారు.

ఇక డిసెంబర్‌ 31 రాత్రి 12 గంటల సమయంలో అంటే జనవరి 1, 2020న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారట.

"""/"/మహేష్‌బాబుకు జోడీగా ఈ చిత్రంలో రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉండబోతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు అనీల్‌ రావిపూడి పూర్తి ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాడు.ప్రస్తుతం సినిమా చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.

చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో విజయశాంతి నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు.

ఆ కారణం వల్ల కూడా ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.సినిమా పబ్లిసిటీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్‌ హ్యాపీ, ఇక వారి సందడి మొదలు కాబోతుంది.

హరీశ్ రావు పక్కా డ్రామా మాస్టర్..: ఎమ్మెల్యే కడియం శ్రీహరి