ఒకే ఒక్కడు మహేష్.. అదిరిపోలా!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను ఇటీవల అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్న మహేష్, ఈ సినిమా జోష్‌తో తన తాజా చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

కాగా తాజాగా మహేష్ సౌత్ ఇండియాలో ఏ హీరోకు సాధ్యం కాని ఓ అరుదైన ఫీట్‌ను సాధించాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మహేష్, తాజాగా ట్విట్టర్‌లో 10 మిలియన్ ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నాడు.

కోటి మంది ఫాలోవర్స్‌ను సాధించిన దక్షిణాది హీరోగా మహేష్ అదిరిపోయే రికార్డును క్రియేట్ చేశాడు.

ఇంత భారీ మొత్తంలో ఫాలోవర్స్‌ను సాధించుకున్న ఏకైక సౌత్ హీరోగా మహేష్ నిలిచాడు.

ఇక తన తాజా చిత్రం సర్కారు వారి పాట పూర్తి సోషల్ మెసేజ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ పరశురామ్.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీలుక్ పోస్టర్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేయడంతో, దానికి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ నటిస్తుండగా కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తరువాతే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

వరుణ్ తేజ్ ను కాపాడే డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాత్రమేనా.. ఫిదా రేంజ్ హిట్ ఇస్తారా?