అఫిషియల్‌ : సర్కారు వారి పాట ట్రైలర్ వచ్చేది కన్ఫర్మ్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు ప్రతి ఒక్క తెలుగు సినీ ప్రేక్షకుడు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట సినిమా వచ్చే నెల 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ ఈ సినిమా దర్శకుడు పరశురామ్ తెరకెక్కించాడు.ఈ సినిమా లో మహేష్ బాబు కు జోడిగా మహా నటి ఫేమ్‌ కీర్తి సురేష్ నటించిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాలో సీనియర్ నటీనటులు చాలా మందే నటించారు.ఈ సినిమా కు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ అందించిన పాటలు ఇప్పటికే సినిమా స్థాయిని పెంచే అనడంలో సందేహం లేదు.

ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న సమయం లో ట్రైలర్‌ ఎప్పుడు వస్తుందా అంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఎట్టకేలకు ఆచార్య ప్రమోషన్‌ హడావుడి తగ్గిన నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా ట్రైలర్ ను మే 2వ తారీఖు న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటన చేయడంతో మహేష్బాబు అభిమానులతో పాటు సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ట్రైలర్ ఉండాలని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.

దర్శకుడు పరశురామ్ గత చిత్రం గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఆ సినిమా తర్వాత పూర్తి వైవిధ్యమైన సర్కారు వారి పాట సినిమా ను తెరకెక్కించాడు.

"""/"/ మరి మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ తో ఒక చిన్న దర్శకుడైన పరశురాం ఎలాంటి సినిమా ను తెరకెక్కించాడు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ట్రైలర్ విడుదల తర్వాత అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని ఏరియాలో రికార్డు స్థాయి లో బిజినెస్ ను ఈ చిత్రం చేయడంతో తప్పకుండా సరికొత్త నెంబర్స్‌ ను ఈ చిత్రం నమోదు చేస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

మే పన్నెండో తారీఖు కోసం ప్రతి ఒక్క మహేష్ బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు.

కల్కి మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా ఎంత వసూలు చేయాలి…