ఉగాది రోజు మొదలై అప్పుడే నిలిచి పోయిన మహేష్‌ బాబు మూవీ

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో బాక్సాఫీస్ వద్దకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకున్న ఆ సినిమా తర్వాత మహేష్‌ బాబు చేయబోతున్న సినిమా సర్కారు వారి పాట.

ఈ సినిమా కు పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.గత ఏడాది మొదలు అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.

దుబాయిలో మొదటి షెడ్యూల్‌ ను పూర్తి చేసుకుని వచ్చిన మేకర్స్‌ రెండవ షెడ్యూల్‌ ను ఇటీవలే హైదరాబాద్‌ లో ప్రారంభించారు.

ఉగాది సందర్బంగా మొదలు అయిన ఈ సినిమా రెండవ షెడ్యూల్‌ అనూహ్యంగా నిలిచి పోయింది.

కరోనా కారణంగా సినిమా షూటింగ్ ను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.కరోనా కారణంగా సినిమా షూటింగ్‌ లు నిలిచి పోయాయి.

సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ నిర్వహిస్తుండగా అందులో అయిదు మందికి కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అయ్యిందట.

దాంతో వెంటనే షూటింగ్‌ ను నిలిపి వేస్తున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.మహేష్ బాబుతో పాటు దర్శకుడు పరశురామ్‌ కూడా క్వారెంటైన్‌ కు వెళ్లారని తెలుస్తోంది.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ కు మొదటి నుండి కూడా కరోనా అడ్డుగా నిలుస్తూనే ఉంది.

అయినా కూడా మహేష్‌ బాబు సర్కారు వారి పాట చిత్రంపై అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

ఇక ఈ సినిమా చిత్రీకరణ కోసం తదుపరి షెడ్యూల్‌ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

పరశురామ్‌ ఈ సినిమా ను ఆర్థిక నేరాల నేపథ్యంలో రూపొందిస్తున్న విషయం తెల్సిందే.

ఇక ఈ సినిమా లో మహేష్ బాబుకు జోడీగా స్టార్‌ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్న విషయం తెల్సిందే.

ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్.. ఇవాళ 3 నియోజకవర్గాల్లో పర్యటన