త్రివిక్రమ్ గారు ఈసారైనా బ్లాక్ బస్టర్ ఇస్తారా.. అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇదే!

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని ఇండస్ట్రీలో పేరుంది.

ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలేవీ ప్రేక్షకులను నిరాశపరచలేదు.జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు ఈ కాంబినేషన్ లో తెరకెక్కాయి.

త్రివిక్రమ్ కథ చెబితే అల్లు అర్జున్ వెంటనే ఓకే చెబుతారని ఇండస్ట్రీలో చాలామంది భావిస్తారు.

పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సక్సెస్ సాధించాయి.

అయితే మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు సినిమా హిట్ టాక్ సంపాదించుకున్నా ఆ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లకు లాభాలు రాలేదు.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా తెరకెక్కిన ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.

ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం కూడా సినిమా ఫ్లాప్ కావడానికి ఒక విధంగా కారణమైందని చెప్పవచ్చు.

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో చాలా సంవత్సరాల తర్వాత మరో సినిమా తెరకెక్కుతోంది.

"""/"/ తాజాగా మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పూజా కార్యక్రమాలు జరిగాయి.

ఈ సినిమాతో అయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబుకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.

కుదిరితే ఈ ఏడాది దసరాకు కుదరని పక్షంలో 2023 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.

త్రివిక్రమ్ వేగంగానే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం.

ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేయగా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ ను ఎంపిక చేశారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ గత రెండు సినిమాలకు కూడా పూజా హెగ్డే, థమన్ పని చేసిన సంగతి తెలిసిందే.

బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన పోసాని కృష్ణమురళి.. ఏం జరిగిందంటే?