తండ్రికి మంచిగా మాలిష్ చేసిన సితార

కరోనా లాక్ డౌన్ ఏమో గానీ నిత్యం షూటింగ్ లతో బిజీ బిజీ గా ఉండే సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తమ తమ ఇళ్లల్లో భార్యలకు సాయం చేస్తూ కొందరు కాలక్షేపం చేస్తుంటే,మరికొందరు ఏమో తమ పిల్లల తో హాయిగా సమయం గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన కూతురు చేత హెడ్ మాలిష్ చేయించుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మొన్నటివరకు షూటింగ్ లతో బిజీ గా గడిపిన మహేష్ సాధారణంగానే కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు.

ఒక సినిమా,సినిమా కి గ్యాప్ టైం లో కుటుంబం తో కలిసి టూర్ వెళుతూ హ్యాపీగా ఉండే మహేష్ ఇప్పుడు ఈ లాక్ డౌన్ పీరియడ్ ను కూడా అదే విధంగా ప్లాన్ చేసుకొని మరి గడుపుతున్నారు.

ఈ లాక్‌డౌన్ రోజులు ఏం చేయాలనేది కూడా ఈయన ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు.

అలాగే చేస్తున్నాడు కూడా.అందులో పిల్లలతో ఆడుకోవడం కీలకం.

పిల్లలతో మహేష్ బాబు జాళీగా పిల్లలతో గడుపుతున్న ఫోటోలను నమ్రత ఎప్పుటి కపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంది.

తాజాగా మహేష్ బాబుక కూతురు సితార హెడ్ మాలిష్ చేయించుకుంటున్న ఫోటో ను నమ్రత తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గౌతమ్ తన ఆట తాను ఆడుకుంటున్నాడు.ఈ లోగా మహేష్ హెడ్ మసాజ్ వాలంటీర్ అయ్యాడని పేర్కొంది.

తన తండ్రికి సితార దాదాపు 2 నిమిషాలపాటు మసాజ్ చేసిందని తన పోస్ట్ లో నమ్రతా తెలిపింది.

"""/"/ మొత్తానికి కరోనా పుణ్యమా అని దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ ఎవరు ఎంత వరకు ఉపయోగించుకుంటున్నారో తెలియదు కానీ మహేష్ మాత్రం బాగా యుటిలైజ్ చేసుకుంటున్నాడు అన్న విషయం అర్ధం అవుతుంది, ఈ యేడాది మహేష్ బాబు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి సక్సెస్ అందుకోగా ప్రస్తుతం పరశురామ్‌తో పాటు హరీష్ శంకర్, వంశీ పైడపల్లి, రాజమౌళిల ప్రాజెక్ట్ లకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

పవన్ అన్నప్రాసన సమయంలోనే అలాంటి పని చేశాడా.. సీక్రెట్ రివీల్ చేసిన అంజనాదేవి?