మాస్ గ్యాంగ్ స్టర్ గా మహేష్.. ఫ్యాన్స్ కు ఇక పూనకాలే..?

మాస్ గ్యాంగ్ స్టర్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే?

సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ''గుంటూరు కారం''.

మాస్ గ్యాంగ్ స్టర్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే?

( Guntur Kaaram ) ప్రస్తుతం శరవేగంగా షూట్ జరుపుకుంటున్న ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు.

మాస్ గ్యాంగ్ స్టర్ గా మహేష్ ఫ్యాన్స్ కు ఇక పూనకాలే?

ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కానుంది.

"""/" / ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత మరో భారీ మూవీ లైన్లో పెట్టుకున్నాడు.

రౌద్రం రణం రుధిరం వంటి సినిమాను తెరకెక్కించి గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నెక్స్ట్ సినిమా చేయనున్నాడు.

ఈ సినిమాను అతి త్వరలోనే లాంచ్ చేయడానికి రాజమౌళి అన్ని సన్నాహాలు చేస్తున్నాడు.

ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. """/" / ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత మహేష్ బాబు తన 30వ ప్రాజెక్ట్ ను సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో చేయనున్నట్టు టాక్ వినిపిస్తుంది.

మహేష్ కెరీర్ లోనే మైల్ స్టోన్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే సందీప్ వంగ ఒక పవర్ ఫుల్ స్టోరీని కూడా సిద్ధం చేసుకున్నాడు.

సరైన సమయం వచ్చినప్పుడు ఈ సినిమాను పట్టాలెక్కిస్తాను అని సందీప్ పలుసార్లు చెప్పుకొచ్చారు.

మరి ఈ విషయంపై తాజాగా ఒక అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ గ్యాంగ్ స్టర్ గా పవర్ ఫుల్ రోల్ చేయనున్నారట.

ఈ స్టోరీని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియెన్స్ అందరిని ఆకట్టుకునేలా అద్భుతంగా సిద్ధం చేశారని టాక్.

ఇదే నిజమైతే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఇది పూనకాలు తెప్పించే న్యూస్ అనే చెప్పాలి.

మరి రాజమౌళి ( Rajamouli )మూవీ ఎప్పుడు పూర్తి అవుతుందో ఇది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో వేచి చూడాల్సిందే.

ఛావా మూవీ క్రియేట్ చేసిన 8 క్రేజీ రికార్డులు ఇవే.. ఇప్పట్లో ఈ రికార్డ్స్ బ్రేక్ అవుతాయా?