ఈసారి మహేష్ కోసం అలాంటి స్టోరీ రెడీ చేస్తున్న త్రివిక్రమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాను డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.

ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.ఈ సినిమా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తునట్టు ప్రకటించాడు.

వీరి ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.అయితే ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాను సూపర్ హిట్ చేయాలనీ త్రివిక్రమ్ గట్టి పట్టుదలతో ఉన్నాడు.

ఈ సినిమా హాసిని అండ్ హారిక సినిమాస్ బ్యానర్ నిర్మిస్తుంది.ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.

"""/"/ ఇప్పుడు ఈ సినిమాను త్రివిక్రమ్ ఒక రివెంజ్ డ్రామాగా తెరకెక్కించ బోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో మహేష్ పాత్రను కొత్తగా విభిన్నంగా పరిచయం చేయబోతున్నాడని.విఎఫ్ఎక్స్ వర్క్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని టాక్.

అయితే ఇందులో త్రివిక్రమ్ కామెడీ కూడా మిస్ అవ్వకుండా చూసుకుంటాడని తెలుస్తుంది. """/"/ ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందని ప్రకటించారు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి అయినా తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంది.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో ఎన్ని రికార్డ్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

వైరల్ వీడియో: విమానంలో కుదుపులు.. అనేకమందికి గాయాలు..