గుంటూరు కారం ఇంకా సగం కూడా అవ్వలేదు.. త్రివిక్రమ్‌ పక్క చూపులు

సూపర్ స్టార్‌ మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వం లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా( Guntur Karam ) పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా సినిమా ను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి అంటూ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించిన విషయం తెల్సిందే.

కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి తీసుకు రావడం సాధ్యమేనా అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అందుకు కారణం ఏంటి అంటే సినిమా యొక్క విడుదల తేదీ దగ్గర పడుతుంది కానీ షూటింగ్‌ మాత్రం జరగడం లేదు.

"""/"/ ఇప్పటి వరకు షూటింగ్ కనీసం సగం కూడా పూర్తి కాలేదు.సినిమా ప్రారంభించి ఏడాది పూర్తి అయ్యింది.

ఇప్పటి వరకు సగం పూర్తి అవ్వక పోడంతో రాబోయే ఆరు నెలల్లో సినిమా మొత్తం పూర్తి అవుతుందా అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు.

పెద్ద ఎత్తున సినిమా గురించి అంచనాలు ఉన్నాయి.ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ను రూపొందించే ఉద్దేశ్యంతో మేకర్స్ భారీ గా ఖర్చు చేయడంతో పాటు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.

త్రివిక్రమ్‌( Trivikram Srinivas ) ఈ సినిమా కోసం పలు సార్లు స్క్రిప్ట్‌ ను మార్చారు.

"""/"/ అందుకే సినిమా యొక్క షూటింగ్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ కాంబోలో అతడు మరియు ఖలేజా సినిమా లు వచ్చాయి.

చాలా సంవత్సరాల తర్వాత వీరి కాంబోలో సినిమా రాబోతుంది.తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు కోరుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ మరో ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరి త్రివిక్రమ్ దీనికి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.

నిర్మాతగా మారుతున్న గోల్డెన్ లెగ్ బ్యూటీ.. ప్రొడ్యూసర్ గా భారీ సక్సెస్ సాధిస్తారా?