నువ్వా నేనా అంటున్న మహేష్-జగపతిబాబు.. ఎవరిది పైచేయి?

కొన్ని కాంబినేషన్స్ ఫ్యాన్స్ కు కానీ ప్రేక్షకులకు కానీ చాలా ఇష్టం.ఈ కాంబినేషన్స్ రిపీట్ అయ్యే కొద్దీ ఇంకా ఇంట్రెస్ట్ గా అనిపిస్తూ ఉంటుంది.

మరి అలాంటి కాంబినేషన్స్ నే సూపర్ హిట్ అంటూ ఉంటారు.అందులో మహేష్ బాబు, జగపతిబాబు కాంబినేషన్ కూడా ఉంది.

వీరి కాంబో ఫ్యాన్స్ కు చాలా ఇష్టం.శ్రీమంతుడు సినిమాలో కొరటాల శివ వీరి కాంబోను తొలిసారి ప్రేక్షకులకు పరిచయం చేసాడు.

ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి.

ఈ సినిమాలో తండ్రి రోల్ లో జగపతిబాబు అదరగొట్టాడు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా ఇందులో నువ్వా నేనా అనే స్థాయిలో వీరిద్దరూ నటించారు.

ఆ తర్వాత మహర్షి సినిమాలో కూడా ఈ కాంబో రిపీట్ అయ్యింది.ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

"""/" / ఇప్పుడు ముచ్చటగా మూడవసారి ఈ కాంబో రిపీట్ కాబోతుంది అని తెలుస్తుంది.

ఈ సక్సెస్ ఫుల్ కాంబో కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఈసారి త్రివిక్రమ్ ఈ కాంబోను సెట్ చేయబోతున్నాడు.

ప్రెజెంట్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

"""/" / ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్ లో సారధి స్టూడియోస్ లో షూటింగ్ జరుగుతుంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో జగపతిబాబు నటిస్తున్నట్టు తెలుస్తుంది.కీలక యాక్షన్ ఘట్టాలను డైరెక్టర్ చిత్రీకరిస్తున్నారు.

మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేష్, జగపతిబాబు క్యారెక్టర్స్ నువ్వా నేనా అనే స్థాయిలో ఉంటాయని తెలుస్తుంది.

చూడాలి ఈ సినిమాలో వీరిద్దరి కాంబో ఎలా ఉంటుందో.

త్రివిక్రమ్ స్వయం వరం సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?